డిల్లీకి సరిపడా ఆక్సిజన్ నిల్వలు పంపిన కేంద్రానికి, ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేజ్రీవాల్. కరోనాతో అతలాకుతలం అవుతున్న దేశ రాజధానికి కేంద్రం 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించింది. ఆక్సిజన్ లేక అల్లాడుతున్న డిల్లీ వాసులను ఆదుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిరోజూ డిల్లీలో కరోనాతో బాధపడుతున్న వారికి 700 వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతోంది. ప్రతిరోజూ అంతమొత్తం ఆక్సిజన్ ఇవ్వాలని కేజ్రీ …కేంద్రాన్ని కోరారు. దీంతో ఇవాళ కేంద్రం 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పంపిణీ చేసింది. ఢిల్లీ మహానగరం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆస్పత్రులకూ ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.