పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి మమతాబెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమం కొద్దిమంది సమక్షంలో జరిగింది. గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ మమతాతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్నికల్లో మమతకు వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ కార్యక్రమానికి హాజరయ్యారు.
బెంగాల్ అసెంబ్లీకి 294 స్థానాలుండగా 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీఎంసీ 213 స్థానాలు సాధించగా…బీజేపీ 77 స్థానాలు గెలుచుకుంది.
అటు బెంగాల్లో హింసాకాండను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ మమతకు సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాంతి స్థాపనకు ప్రభుత్వం పనిచేయాలన్నారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రం ఎన్నికల సంఘం చేతిలో ఉందని…అన్ని పరిస్థితులకు కారణం ఈసీ, గవర్నరే కారణమని మమత ఆరోపించారు. తాను బాధ్యత చేపట్టాను కనుక ఇక బెంగాల్ ప్రశాంతంగా ఉంటుందనీ చెప్పుకొచ్చారు.