20 ఏళ్ల నుండి ఒకే నినాదం
మోదీ ….దిగిపో ..దిగిపో… అని..!!
గుజరాత్ గద్దెమీద మోడీ ఉంటే దిగు దిగు అంటే ఢిల్లీ సింహాసనంపై తిష్టవేసి కూర్చున్నాడు….
ప్రజాస్వామ్యం గొంతు ను కోసే స్టాలిన్ మావో
వారసులు మీరు ఇంకేం ఏం చెప్తారు….!?
ఎప్పుడు అశాంతిగా ఉంటేనే మీరు శవాలపై పేలాలు ఏరుకోవచ్చు.. మీ కొవ్వొత్తులు…
విషపు రాతలు …. ఎర్ర కూతలు…
అనేక ఘటనలపై కి షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు… ఇది మార్క్స్ చెప్పిందే కదా..!?
మీకు బుకర్ ప్రైజ్ లు వగైరా రావాలంటే అంతమాత్రం చేయాల్సిందే….
మీరు అంతర్జాతీయ వేదికలపై కనిపించాలంటే ఈ మాత్రం మాట్లాడాల్సిందే….
అయినా ఇప్పుడు రాహుల్ గాంధీ నో ,మన్మోహన్ సింగ్ నో,
సీతారాం ఏచూరి నో… తక్షణం ప్రధానిని చేద్దామా..!
లేదా మీకు ఇష్టమైన జిన్పింగ్ నో… కొరియా కిం గాడినో…
ఆఖరికి ప్రచండ నో… గద్దెనెక్కిద్దామా…!?
ఎప్పుడంటే అప్పుడు అపఖ్యాతిపాలు చేసి దింపడానికి
ఈ మోదీ …ట్రంప్ కాదు కదా తల్లి….
ఇంత సంక్షోభంలో మన ప్రభుత్వాలే కాదు… కాకలు తీరిన కొమ్ములున్న… మీ బైడెన్ అంకులే తల పట్టుకున్నాడు..
ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ చేతులెత్తేశాయి.
150 కోట్ల జనాభా ఉన్న మనం గుడ్డిలో మెల్లగా మన ప్రజలను రక్షించుకుంటూ….
ఆర్థిక స్థితిగతులను పరిరక్షించుకుంటూ పోకపోతే.
బిచ్చం అడుక్కునే పరిస్థితి వస్తుంది….
నా పిచ్చి గానీ ఇవన్నీ మీకు తెలియదా….
లాక్ డౌన్ పెడితే వలసకూలీలను మోదీ చంపేశారని
పాటలు రాస్తారు… ఏడుపుగొట్టు రాగాలతో ఆలపిస్తారు
పెట్టకపోతే కరోన ఎక్కువైంది అంటారు….
మొన్నటి “”ఎలక్షన్లు వద్దు”” అని మోది ఒకవేళ అని ఉంటే
అయిపోయింది మోదీ పని అంటూ న్యూయార్క్ టైమ్స్ లో నువ్వే వ్యాసం రాసే దానివి….
ఎలక్షన్ పెట్టినందుకు… మోదీనే ప్రచారం చేసి కరోనా వ్యాప్తి చేశారు అంటారు…
అయినా ఇప్పుడు ఎలక్షన్లకు ఏం తొందర అని మీరే ప్రశ్నిస్తారు…
మీ మనసు లోకి చొరబడడం మావోయిస్టులకు సాధ్యం అవుతుందేమో కానీ మోదీకి మాత్రం సాధ్యం కాదు…
అరుంధతీ రాయ్…. ఇంతటితో వదిలేయమ్మ…
(మోదీ దిగిపోండి అన్న అరుంధతీ రాయ్ వ్యాఖ్యలకు…డా. భాస్కర యోగి స్పందన)