ఫోర్బ్స్ లిస్టులో టీఆర్ఎస్ ఎంపీ కూతురు “కీర్తి”..!
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో తెలంగాణ యువతికి చోటుదక్కింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామినికి చెందిన 24 ఏళ్ల కీర్తి రెడ్డికి ఈ ఘనత దక్కింది. ఫోర్బ్స్ ఇండియా అండర్-30 లిస్టులో కీర్తిరెడ్డి ఈ స్థానానికి సాధించారు. కీర్తి రెడ్డి తండ్రి ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు. ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్టులో స్థానం దక్కించుకున్న 13 మంది మహిళల్లో కీర్తి రెడ్డి కూడా ఒకరు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ నుంచి కీర్తి రెడ్డి గ్లోబల్ మాస్టర్స్ పట్టాను పొందారు. ప్రస్తుతం కీర్తి రెడ్డి స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రాకింగ్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా (సీఓఓ) పనిచేస్తున్నారు. తన తండ్రి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తనకు స్ఫూర్తి అని ఆమె తెలిపారు. లండన్లో మాస్టర్స్ పూర్తి చేసిన అనంతరం.. సింగపూర్కు చెందిన సైప్లె చైన్ కంపెనీ క్యూనికస్తో కొంతకాలం పనిచేసినట్లు ఆమె తెలిపారు.