తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక ఈ 24 గంటల్లోనే 4,009 కరోనా కేసులు నమోదు కాగా.. 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 3.55 లక్షలకు చేరగా.. 1,838 మంది మరణించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 39,154 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 3.14లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని వివరిస్తూ…. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 705 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మేడ్చల్ 363, నిజామాబాద్ 360, రంగారెడ్డి 336, సంగారెడ్డి జిల్లాల్లో 264 కరోనా కేసులు నమోదైనట్టు తెలిసింది.