దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏప్రిల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ పరీక్షలను వాయిదా వేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. తదుపరి పరీక్ష నిర్వహించే తేదీలను 15 రోజుల ముందుగా ప్రకటిస్తామని స్పష్టంచేసింది. ఇంతకు ముందు ప్రకటించిన రెగ్యూలర్ షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలు ఏప్రిల్ 27, 28 ,30 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.ప్రాణాంతక కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్నందున విద్యార్థుల ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తెసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.అటు ఈ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు ఏబివిపి పేర్కొంది. ఈ మేరకు అధికారిక ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది.