జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషిస్తే వ్యవస్థలో ఎన్ని లోపాలు, కుట్రలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది.. సంక్షిప్తంగా గమనించండి..
టీఆర్ఎస్ మొత్తం 11,92,162 (35.73%) ఓట్లు తెచ్చుకొని 56 సీట్లు గెలిచింది..
బీజేపీ మొత్తం 11,86,096 (35.55%) ఓట్లు సాధించి 48 సీట్లలో విజయం సాధించింది..
ఎంఐఎం మొత్తం 6,30,867 (18.91%) ఓట్లు పొంది 44 సీట్లు పొందింది..
కాంగ్రెస్ 2,20,504 (6.61%) ఓట్లతొ 2 సీట్లు మాత్రమే గెలచింది..
టీడీపీకి కేవలం 55,287 (1.65%) ఓట్లు వస్తే ఒక్క సీటు కూడా రాలేదు..
మొత్తం మీద బీజేపీపై అధికార టీఆర్ఎస్ కేవలం 6,066 ఓట్లు మాత్రమే (0.18 %) అధికంగా పొందింది..
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. టీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్లు, సీట్లతో పోలిస్తే ఎంఐఎంకి ఎలా ఎక్కువ ఫలితాలు వచ్చాయి?
మొత్తం ఓట్లలో 35.55%, 35.55% ఓట్లు సాధించిన టీఆర్ఎస్, బీజేపీలకన్నా చాలా తక్కువ ఓట్లు అంటే 18.91% వచ్చిన ఎంఐఎంకు ఈ స్థాయిలో సీట్లు ఎలా సాధ్యమైంది?
ఎంఐఎం గెలిచిన డివిజన్లు అన్నీ ఆ పార్టీ ప్రాభల్యం అధికంగా ఉన్న పాతబస్తీ పరిధిలోనివే.. ఈ ప్రాంతంలో తక్కువ ఓటర్ల సంఖ్యతో ఎక్కువ డివిజన్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ, డివిజన్లు తక్కువ.. ఈ వ్యత్యాసం జీహెచ్ఎంసీ డివిజన్లకే పరిమితం కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలు, హైదరాబాద్ పార్లమెంట్ సీటు విషయంలో కూడా కనిపిస్తుంది.
దశాబ్దన్నర క్రితం కుట్ర పూరితంగా డివిజన్లు, నియోజవర్గాల పునర్విభజన, సరిహద్దుల ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ఒకప్పుడు 5 లోపు ఉంటే మజ్లిస్ అసెంబ్లీ సీట్లు 8 కి పెరిగాయి.. జీహెచ్ఎంసీలో కూడా ఆ పార్టీ జనాభా (ఓటర్ల) నిష్పత్తికన్నా ఎక్కువ సీట్లు పొందడం సాధ్యమవుతోంది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ లో ఎంఐఎంతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగిన దాఖలాలు కనిపిస్తాయి. గతంలో కాంగ్రెస్ అనుసరించిన పంథానే ఇప్పుడు టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఎన్టీఆర్ హయంలో టీడీపీ కూడా ఎంఐఎంతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పంచుకుంది..
కనీసం వచ్చే ఎన్నికలనాటికైనా నిష్పాక్షింగా డివిజన్లు, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి.. న్యాయంగా ఎన్నికలు జరగాలి..
-క్రాంతిదేవ్ మిత్ర