రేపటి నుండి ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యసేవలు సత్వరం అందించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేయడంపట్ల ప్రెస్క్లబ్ హర్షం వ్యక్తంచేసింది. ప్రెస్క్లబ్ హైదరాబాద్ బృందం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి, అనేక మంది జర్నలిస్టుల మరణాలు, వైద్యం కోసం జర్నలిస్టుల పడుతున్న తీవ్ర ఇబ్బందులను వివరించిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ప్రత్యేక వాట్సాప్ నెంబర్ను జర్నలిస్టుల కోసం అందుబాటులో ఉంచుతామని వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కోవిడ్ లక్షణాలున్న జర్నలిస్టులు తమ వివరాలను అందులో అప్లోడ్ చేసే పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్ల కేటాయింపు చేసేందుకు ప్రత్యేక టీంను అందుబాటులోకి తెస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వాక్సినేషన్ కేంద్రాలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.