అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. కోవిడ్ బారిన పడిన రాజన్ ను ఏప్రిల్ 26న ఎయిమ్స్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన చనిపోయినట్టు జాతీయ మీడియాలో వచ్చింది. అయితే కాసేపటికే చోటారాజన్ ను చనిపోలేదని ఎయిమ్స్ ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎన్ఐలో వచ్చింది.
2015లో అరెస్ట్ అయిన చోటా రాజన్ అప్పటినుంచి తీహార్ జైల్లో ఉంటున్నాడు. అతనిపై 70 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. వీటన్నిటినీ సీబీఐకి బదిలీ చేశారు. ప్రత్యేక కోర్టుకేసులను విచారిస్తోంది.