కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ ఏకంగా 480 మంది చర్చి ఫాదర్స్ పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ)లో గత నెలలో చర్చి ఫాదర్ల వార్షిక సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 13 నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఫాదర్లు హాజరయ్యారు. కొద్దిరోజులకే దాదాపు వందమందికి పైగా ఫాదర్లు కరోనా బారిన పడ్డారు. ఇద్దరు చనిపోయారు కూడా.
దీంతో విచారణ చేపట్టిన అధికారులు…కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం నిర్వహించినట్టు తేల్చారు. ఆ సమయంలోనే కరోనా వ్యాపించిందని నిర్థారించారు. రెవెన్యూ అధికారుల కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కరోనాతో బాధపడుతున్న ఫాదర్లలో కొందరు చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరు హోం ఐసోలేషన్ లో ఉన్నారు.