మహారాష్ట్రలో సోమవారం 5 లక్షల మందికి పైగా వ్యాక్సీన్లు వేయించుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.4,678 మంది ఆరోగ్య సిబ్బందికి తొలి డోసు వ్యాక్సీన్ వేయగా.. 12,179 మంది రెండో డోసు వేయించుకున్నట్టు రాష్ట్ర ఆరోగ్యమంత్రి వెల్లడించారు. కాగా ఒక్క ముంబైలోనే 69,922 మంది వ్యాక్సీన్ వేసుకున్నారు.దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే..అయితే కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పట్టాయి.