వెస్ట్ బెంగాల్, అసోంతో పాటు.. మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. బెంగాల్, అసోంలో మూడో దశ పోలింగ్ కాగా.. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే దశలో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
అసోం, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో ఎక్కువగా సున్నిత ప్రాంతాలు ఉండటం వల్ల.. విడతల వారీగా పోలింగ్ నిర్వహిస్తుండగా.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో నిర్వహిస్తున్నారు. ఉదయానికే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6.00 గంటల వరకు లైన్లో ఉన్న అందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు.
కాగా, అసోంలో మూడో దశలో 337 మంది వారి భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిశ్వా కూడా ఉన్నారు. ఇక బెంగాల్లో కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఈ మూడో దశలో 31 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
https://twitter.com/ANI/status/1379248347765112832
https://twitter.com/ANI/status/1379245230688333826